Friday, September 21, 2012

అది అండమాను ద్వీపం..చూశాను నేనొక పుణ్యక్షేత్రం

అది అండమాను ద్వీపం..చూశాను నేనొక పుణ్యక్షేత్రం

మన దేశానికి పట్టిన దెయ్యాలను తోలిన దేవుళ్ళ నివాసం

బ్రిటిషు బకాసురులు చేసిన విఫల ప్రయత్నం

చిత్ర విచిత్ర చిత్ర హింసల పర్వం..ఓర్చుకొని గెలిచిన వీరాది వీరుల సమూహం ..

ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది రక్త తర్పణం ..

వింటుంటే ఊగి పోయింది నా శరీరం..చూస్తుంటే చలించిపోయింది నా దేహం

వారి కష్టాలకు కన్నీరు మున్నీరయింది నా హృదయం..ఆ త్యాగధనులను శ్లాగిస్తూ సాగింది నా కలం..



ఎన్ని పాట్లు పడ్డారు ...ఎంత యాతన పెట్టారు..అది జయిలా కాదు కాదు కర్కోటక నరకం ..

దాని పధకమే భయానకం..అది ఆ పాలకుల నీచ కృత్యాలకు నిదర్శనం..



ఆ ఆంగ్ల పిశాచాలు చేయని అకృత్యము లేదు..కనిపెట్టని హింస పద్దతులు లేవు

వారు నేరస్తులా వారిని ఆ రీతిలో హింశించటం అవసరమా ..

అడిగే వారె లేరు...అరణ్య రోధనయింది ఆ మహానుభావుల వేదన ..



ఒక్క జై! చాలు బ్రిటిష్ వారికి వారి నోటి నుండి.. ఒక్క ఆలోచన చాలు నాకెందుకని..

వదలి వేసి ఉండేవారు వారిని బ్రిటిషువారు...గడప గలిగే వారు ఆనందకరమైన జీవితాన్ని...


కదల లేదు వారి కార్య దీక్ష..నిరంతరం ప్రవహించింది వారి స్వతంత్ర కాంక్ష ..

బహుశా ఏ దేశములో పుట్టి ఉండరేమో ఇటువంటి త్యాగ మూర్తులు ..

ఏ నేల పై జీవించి ఉండరేమో ఇలాంటి నిజమైన నాయకులు ..



ఎందుకోసం చేసారు వారు..ఎటువంటి భావి భారతం కోసం కలలు కన్నారు వారు ..

మనం వారి వారసులమే కదా .. ఏమయి పోయింది మనలో ఆ అకుంటిత దీక్ష ..

ఎక్కడ పాతుకు పోయింది ఆ మహానుభావుల ఉద్రేకం ..

ఏ మూల కూరుకు పోయింది ఆ త్యాగధనుల సేవా భావం..



ఎందుకిలా బానిసలమవు తున్నాము విదేశీ సంస్కృతికి ..విదేశీ ఉత్పత్తులకు ..వికృత చేష్టలకు..

ఎందుకిలా మునిగిపోతున్నాము అక్రమ సంపాదనలో, అదికార దుర్వినియోగంలో, అతి ఆశల ఊబిలో , దురలవాట్ల దుర్గందంలో..

ఎందుకిలా విడిపోతున్నాము కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, భాష పేరుతో...

ఎందుకిలా పతనమైపోతున్నాము ఆలోచనలేక, వివేచన లేక, విచక్షణ లేక, కరుణ లేక, సామాజిక బాద్యత లేక..



మన నెత్తురు చల్లారి పాయిందా ..మనకు మన దేశ సంక్షేమం మనకు పట్టదా ..

మన దేశాన్ని గొప్ప దేశంగా నిర్మించవలసిన బాద్యత మనకు లేదా ..



ఆర్దికంగా పెరుగుతున్నాము .. ఆత్మహత్యలూ ఆపలేక పోతున్నాము ..

భవనాలు కడుతున్నాము ...మురికి వాడలు పెంచుతున్నాము..



ప్రతి భారతీయుడు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సంధి సమయం ..

మన భవిష్యత్తుకోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానీయులకు మొక్కి వారి అడుగు జాడలను అనుసరించవలసిన అవసరం ..

నవ భారత నిర్మాణానికి నేను సైతం అంటూ నడుం కట్టవలసిన తరుణం..





















No comments:

Post a Comment