Monday, January 9, 2012

దేశక్షేమమే పరమావధిగా సకలజనుల సమ్మేళనముతో సాధించు అభ్యుదయ భారతాన్ని....

ధర్మ దక్షులు నిజాయితీ నిబద్దులు ప్రజారంజక ప్రభువులు పాలించిరి ఈ భాగ్యవిదాతను...
సుద్ద శుంటలు నిరక్షర నిరర్దకులు  కఠిన కర్కోటకులు ఆక్రమించిరి అధికారమును...
విశ్లేషనాత్మక విజ్ఞానముతో ప్రజ్వలించే ప్రజాస్వామ్యముతో ఎంపిక చేయి భారత నాయకత్వాన్ని...


సకల కళా సంసిద్దులను వివేక విదురులను సరస్వతీ స్వరూపులను కన్నది ఈ జగజ్జనని...
విచక్షణా విహీనులకు అక్షర శూన్యులకు మానసిక వికలాంగులకు నిలయంగా మారుతున్నది...
అక్షరదీపం వెలిగించి వయోజన విద్యను ప్రోత్శాహించి రూపు మాపు నిరక్షరాస్యతను...


స్వీయ సాదికారత్వముతో పాడిపంటలతో ఐకమత్య బలముతో నడిచినది ఈ సుఖదాయని....
కీచులాట పోరాటములకు స్వార్ధపరుల అక్రమ సంపాదనకు అసాంఘిక శక్తులకు అవకాశము కల్పిస్తున్నది...
దేశక్షేమమే పరమావధిగా సకలజనుల సమ్మేళనముతో సాధించు అభ్యుదయ భారతాన్ని.... 

  
     

  
 
  
  

  
  

No comments:

Post a Comment