నన్ను దోచుకొందువటే అంటూ తెలుగు వారి మనసు దోచుకొన్న నారాయణుడా..
ఉర్దూ భాషలో చదువు మొదలుపెట్టి తెలుగు కే తలమానికముగా మారిన జ్ఞానపీఠమా..
తీయనైన భాషతో పగలే వెన్నెల కురిపించి జగమే ఊయలగా మార్చిన పద్మ భూషణుడా..
ఏ దేశమేగినా ఎందు కాలిడినా నిలుపరా నీ జాతి గౌరవము అన్న రాయప్రోలు రచనకు మెరుగులు దిద్ది జాతి ఐక్యతా భావాలను జోడించిన దేశ భక్తుడా..
కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి శిష్య రత్నమా..
తెలుగు గజల్ గీతాలను సృష్టించిన సాహిత్య సార్వభౌముడా..
గున్నమామిడి కొమ్మ మీదున్న కోయిలా చిలుకల చెలిమితో జాతి కుల మత కుడ్యాలను పగులగొట్టిన దార్శనికుడా..
తెలిసిందిలే తెలిసిందిలే అంటూ సులువైన పదాలతో భాషామృత జలధారలను కురిపించిన కళాప్రపూర్ణుడా..
ఎన్నో పుస్తకాలు, మరెన్నో కవిత్వాలు, వేలకొద్దీ పాటలు ఇఛ్చిన సర్వస్వతీ దేవి వరపుత్రుడా..
మిమ్ములను కన్న ఈ తెలుగు నేల మురిసిపోవుచున్నది.
మీరు దేహాన్ని వదిలి వెళ్లారని నమ్మలేక పోవుచున్నది ..
తిరిగి మరలా వస్తాడు మా నారాయణ రాజు ఈ రోజు అంటూ వేల తారకల నయనాలతో ఈ తెలుగు నేల తమరి రాకకోసం ఎదురు చూస్తున్నది..
No comments:
Post a Comment