పది మంది కలిసి పని చేస్తే పుట్టేది ప్రభంజనం..
ఒక్కొక్కరే విడి విడిగా కదులుతుంటే అది ఒంటరి పోరాటం..
ఒకరి బలం అందరి బలంగా అయిపోతుంది ఐకమత్యంతో..
నేనొక్కడినే అన్నీ చేయగలను అనుకోవటమే అతిపెద్ద అజ్ఞానం..
దండుగా కలిసిన చలి చీమలే చంపుతాయి కొండచిలువను..
గుంపుగా పేనిన గడ్డి పోచలే కట్టి పడేస్తాయి మద గజాన్ని..
మనం తెలుసుకున్న దానిని తోటి వారికి నేర్పటముతోనే వస్తుంది విజయం..
అందరిలో మనం మమేకమై సాగితే వచ్చే ఉపాయాలు అనంతం..
సొంత లాభాన్ని అందరి లాభంగా మార్చి ఆలోచిస్తే మన చుట్టూ ఉంటుంది స్వర్గధామం..
ఎవరేమైనా పరవాలేదు నేనే అన్ని అందలాలు ఎక్కాలి అనుకోవటంతోనే మొదలు అందరి పతనం..
గుంపుగా ఉన్న జీవుల మందనుండి ఒక్క జీవిని సింహం వేటాడలేదు..
కలసికట్టుగా జీవించే మనుషులను ఎటువంటి ఎటువంటి దుష్ట శక్తులు వేరుచేయలేవు..
పుట్టుకతోనే మనిషి సంఘజీవి..
ఆ సంఘాన్ని విస్మరిస్తే అతనే విగత జీవి..
మనమెంత గొప్ప అనేది చెప్పుకోవటం కాదు జీవితం..
మనమెంతమంది మనుషుల మనుసుల్లో మంచిమనిషిగా జీవిస్తున్నాం అనేదే జీవితం..
అందుకే వదిలివేయు నేను అనే అహాన్ని..
మరచిపోవద్దు మనం అనే మహా మంత్రాన్ని..
No comments:
Post a Comment